హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): శాసనసభలో లఘచర్చల సందర్భంగా స్పీకర్ పోచా రం ఆయా వర్గాలకు సముచిత గౌరవం కల్పించారు. సోమవారం అసెంబ్లీలో మైనార్టీ సంక్షేమం, పాతబస్తీ అభివృద్ధిపై చర్చ సమయంలో ప్యానల్ స్పీకర్గా ముంతాజ్ అహ్మద్ఖాన్ను, మంగళవారం దళితబంధుపై చర్చ సందర్భంగా ప్యానెల్ స్పీకర్గా అదే సామాజిక వర్గానికి చెందిన హన్మంత్షిండేను కూర్చోబెట్టారు.