హైదరాబాద్, ఏప్రిల్ 9(నమస్తే తెలంగాణ): దుకాణాలు, ఎస్టాబ్లిష్మెంట్లు 24 గంటలూ తెరిచి ఉంచేందుకు వీలు కల్పించే ఉత్తర్వులు (జీవోఎంఎస్-4) ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖకు వర్తించవని ప్రభుత్వ కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీల శాఖ స్పష్టంచేసింది.
ఎక్సైజ్ చట్టాలు, నిబంధనల ప్రకారం నిర్దేశించిన సమయాల్లోనే టీఎస్ బీసీఎల్, ఐఎంఎఫ్ఎల్ డిపో లు, డిస్టిలరీలు, బ్రేవరీలు, ఏ4 షాపు లు, 2బీ బార్లు తెరిచి ఉంటాయని ఓ ప్రకటనలో తెలిపింది. 24 గంటలపాటు దుకాణాలను తెరిచివుంచే విధానం న్యూఢిల్లీ, ముంబయి, బెంగళూరు తదితర మెట్రో నగరాల్లో ఇప్పటికే అమల్లో ఉన్నదని పేర్కొన్నది.