హైదరాబాద్: సుచిరిండియా సీఈవో లయన్ కిరణ్ ఆధ్వర్యంలో ఇంద్రలోక్ థీమ్తో నిర్వహించిన ‘K పార్టీ ఫ్యాషన్ షో’లో సినీ తారలు సందడి చేశారు. స్టయిల్, ఫ్యాషన్ షో, ఫన్, డ్యాన్స్ తో కూడిన ఈవెంట్ అందరిని అలరించింది. తారామతి బారాదరి ఈ కార్యక్రమ నిర్వహణకు సరిగ్గా సరిపోయింది. సినీ తారలు హాజరై సందడి చేసిన ఈ పార్టీ ఆద్యంతం అత్యంత ఆనందంగా, ఉత్సాహంగా జరిగింది.
ప్రతి ఏడాది సుచిరిండియా సీఈవో లయన్ కిరణ్ తన బర్త్ డే సందర్భంగా ‘K పార్టీ ఫ్యాషన్ షో’ను ప్రత్యేక థీమ్లతో నిర్వహిస్తుంటారు. ఇపుడు ఇంద్రలోక్ థీమ్తో నిర్వహించిన ‘K పార్టీ ఫ్యాషన్ షో’లో పొలిటీషియన్స్, బిజినెస్ మెన్, సినీ తారలు సరదాగా, ఫన్నీ స్టేట్మెంట్స్తో ఎంజాయ్ చేశారు.
లయన్ కిరణ్ హోస్ట్ చేసిన ఈ కార్యక్రమానికి సినీ తారలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. నటుడు సాయి కుమార్, అనూప్ రూబెన్స్, ఆర్పీ పట్నాయక్, బిగ్ బాస్ అశ్విని, సరయు, మిత్ర శర్మ, ఖయ్యూమ్, సోహైల్, కనిష్క, భూపాల్, మధుసూధన్, శివారెడ్డి, ఇంటర్నేషనల్ మోడల్స్ ఈ ఫ్యాషన్ షోకు హాజరయ్యారు.