పెద్దపల్లి, నమస్తే తెలంగాణ/మహదేవపూర్, జూలై 9: కాళేశ్వరం ప్రాజెక్టులో భా గంగా నిర్మించిన లక్ష్మీ బరాజ్కు వరద భారీ గా చేరుతున్నది. బరాజ్ పూర్తి నిల్వ నీటి సా మర్థ్యం 16.17 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 6.32 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. శనివారం ఇన్ఫ్లో 2,26,300 క్యూసెక్కులు, నాలుగు లక్షల క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైంది.
బరాజ్ 57 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు. శనివారం రాత్రి 7 గంటలకు పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి బరాజ్ 10 గేట్లు ఎత్తి 49,440 క్యూసెక్కుల నీటిని దిగువన గల పార్వతీ బరాజ్ బ్యాక్ వాటర్ ఏరియాకు విడుదల చేశారు. పార్వతీ బరాజ్లోకి 4,365 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. దీంతో బరాజ్లోని 50 గేట్లను ఎత్తి 55 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.