కరీంనగర్ : హుజురాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని జమ్మికుంట పార్టీ ఇంచార్జి, వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. జమ్మికుంట మండలం వావిలాల గ్రామంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హుజురాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు.
దానికోసం ప్రతి ఒక్క కార్యకర్త ముందుండి పని చేయాలని సూచించారు. ఒక్కరు పార్టీని వీడి వెళ్లినంత మాత్రన పార్టీకి ఏమి నష్టం కాదని, వేల మంది కార్యకర్తలను తయారు చేసే సత్తా టీఆర్ఎస్ పార్టీ కి ఉందని పేర్కొన్నారు. ఎవరు బాధ పడాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరిని పార్టీ కంటికి రెప్పలా కాపడకుంటుందని హామీ ఇచ్చారు.
గ్రామాల్లో ప్రజాప్రతినిధులు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెల్లాలని, సంక్షేమ పథకాలు ఆగకుండా ప్రతి ఒక్కరికి అందాలని సూచించారు.
అనంతరం మండలంలోని అన్ని గ్రామాల్లో అవసరమైన అబివృద్ధి పనులపై స్థానిక ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యే రమేష్ చర్చించారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో జిల్లా మంత్రి సహకారంతో మండలానికి కావాల్సిన నిధులను మంజూరు చేపిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ కనమల్ల విజయ, సూడా చైర్మన్ జీవీ రామకృష్ణ రావు, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వర్ రావు, జమ్మికుంట జడ్పీటీసీ శ్యామ్, ఎంపీపీ దొడ్డే మమత, వైస్ ఎంపీపీ తిరుపతి రావు, జిల్లా రైతు మెంబర్ లింగరావు, సర్పంచులు ఫోరం అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.