కోయిలకొండ, జూలై 12 : మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండల కేంద్రంలోని శ్రీరామకొండపై చిరుత తన పిల్లలతో ప్రత్యక్షమైంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామకొండ క్షేత్రంలోని ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో చిరుతతోపాటు పిల్ల చిరుతలు సంచరిస్తుండగా.. బుధవారం ఉదయం ఆలయ దర్శనం కోసం వెళ్లి రాజుతోపాటు పలువురు భక్తులు చూసి భయంతో పరుగులు పెట్టాడు.
కొండ కిందికి వచ్చి విషయాన్ని స్థానికులకు తెలిపారు. వారు ఫారెస్ట్ అధికారులకు సమాచారమిచ్చారు. తొలకరి సమయం కావడంతో తన పిల్లలను సంరక్షించుకునేందుకు చిరుతలు నీటి వసతులు ఉన్న ప్రాంతాలకు వస్తాయని, ఇందులో భాగంగా కోయిలకొండపైకి చేరినట్లు డీఎఫ్వో సత్యనారాయణ తెలిపారు. చిరుత ఉన్న ప్రాంతానికి ఎవరూ వెళ్లరాదని, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.