రిజర్వ్ బ్యాంకు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న వేళ భారతీయ రిజర్వ్బ్యాంక్ శుభవార్త చెప్పింది.
ఎన్టీఆర్ బొమ్మను రూ.100 నాణెంపై ముద్రించేందుకు ఆర్బీఐ గవర్నర్ సుముఖత వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ కుమార్తె, మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి వెల్లడించారు.