మన్సూరాబాద్, మార్చి 19 : భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న చింతపండు నవీన్తోపాటు క్యూ న్యూస్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదివారం మూడు పోలీస్ స్టేషన్లలో వేర్వేరుగా ఫిర్యాదులు ఇచ్చారు. భారత జాగృతి రంగారెడ్డి జిల్లా విద్యార్థి విభాగం నాయకులు నవీన్గౌడ్, భగత్యాదవ్, సునీల్జోషి, అనిల్, శివ, ఈశ్వర్ ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండిగల్ ఠాణాలో భారత జాగృతి యువత మేడ్చల్ జిల్లా కన్వీనర్ పడాల మనోజ ఫిర్యాదు చేయగా, జీడిమెట్లలో ఇందిరారెడ్డి, సంధ్య, లక్ష్మి, అరుణా, భాగ్యలక్ష్మి తదితరులు ఫిర్యాదు అందించారు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి, భీమ్గల్ ఠాణాల్లో జాగృతి నాయకులు, భూపాలపల్లిలో భారత జాగృతి యువత రాష్ట్ర కార్యదర్శి అమ్మ అశోక్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు మాడ హరీశ్రెడ్డి తదితరులు ఫిర్యాదు చేశారు.