LIP | హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ) : సర్కారు బడుల విద్యార్థుల కోసం ‘లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం’ (ఎల్ఐపీ)ను ఆగస్టులో ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందుకు జూలైలో టీచర్లకు శిక్షణ పూర్తిచేయనున్నట్టు పేర్కొన్నది. విద్యార్థులు కనీస సామర్థ్యాల సాధించడమే ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం. ప్రాథమిక తరగతుల విద్యార్థుల కోసం తొలిమెట్టు పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిరుడు నిర్వహించిన విషయం తెలిపిందే. ఈ ఏడాది 6 నుంచి 9తరగతుల విద్యార్థులకు లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాంకు విద్యాశాఖ రూపకల్పన చేసింది. ఇందులో మూడు అంశాలను ప్రాధాన్యంగా తీసుకొని అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. తరగతి గది బోధనను మెరుగుపర్చడం, విద్యార్థులు భాషల్లో చదవడం.. రాయడం, టీచర్లలో సామర్థ్యాలను పెంచడం (టీచర్స్ కెపాసిటీ బిల్డింగ్) వంటి అంశాలపై దృష్టిసారించారు. ఏం చదివారో.. ఏం నేర్చుకున్నారో చెప్పలేని పరిస్థితుల నుంచి విద్యార్థులను గట్టెక్కించేందుకు ఈ ప్రోగ్రాంకు విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. పాఠశాల విద్యాశాఖ, ఆస్కీ, సేవ్ ది చిల్డ్రన్స్ సంస్థలు భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తారు.
కార్యక్రమ అమలు ఇలా..