హైదరాబాద్ : రాష్ట్రంలోని లా కళాశాలల్లో న్యాయ విద్య ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్ దరఖాస్తుల గడువును మరోసారి పొడిగించారు. లాసెట్, పీజీ ఎల్ సెట్ దరఖాస్తులను ఈ నెల 15 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా స్వీకరించనున్నారు. గతంలో మే 26 వరకు మాత్రమే దరఖాస్తులకు తుదిగడువుగా నిర్ణయించగా కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో జూన్ 3వ తేదీ వరకు దరఖాస్తు గడువును పొడిగించారు. ఈ గడువును గురువారం మరోసారి పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆసక్తిగల, అర్హులైన విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.