హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): గురుకుల ప్రతిభ కళాశాలలో (సీవోఈ) శిక్షణ పొంది ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందిన 124 మంది విద్యార్థులను మంగళవారం సత్కరించారు. గురుకులాల సొసైటీ కార్యదర్శి నవీన్ నికోలస్ చేతుల మీదుగా ల్యాప్టాప్లతోపాటు రూ.40వేల చొప్పున నగదు ప్రోత్సాహకం అందజేశారు. ఎంబీబీఎస్ అడ్మిషన్ పొందిన 160 మంది విద్యార్థులకు రూ.50 వేల చొప్పున నగదును అందించారు.