చేర్యాల, ఏప్రిల్ 2: కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి భక్తులకు మల్లన్న ఆలయం శుభవార్త తెలిపింది.రూ.500 వెచ్చించి వీవీఐపీ దర్శనం టికెట్ తీసుకున్న భక్తులకు 400 గ్రాముల లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా అందించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని ఆదివారం నుంచి అమలులోకి తేనున్నారు. గతేడాది రూ.300 ఉన్న వీవీఐపీ దర్శనం టికెట్ ధరను ఈ ఏడాది బ్రహ్మోత్సవాల సందర్భంగా రూ.500కు పెంచారు. వీవీఐపీ దర్శనం టికెట్లు ఎన్ని కొనుగోలు చేస్తే అన్ని లడ్డూలను భక్తులకు అందజేస్తామని ఆలయ ఈవో ఏ బాలాజీ తెలిపారు.