చిట్యాల, మే 21: తాటిచెట్టుపై ప్రమాదంలో చిక్కుకున్న ఓ గీత కార్మికుడిని తోటి కార్మికుడు కా పాడాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం తిరుమలాపూర్లో ఆదివారం చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన గోపగాని రవి కల్లు తీసేందుకు తాటిచెట్టు సగం వరకు ఎక్కాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు మోకు జారిపోయి చెట్టుపైనే వేలాడాడు. కిందనే ఉన్న తోటి గీత కార్మికుడు ఆరెల్లి సాంబయ్య అతడిని గమనించి, వెంటనే చెట్టు ఎక్కి రవిని కాపాడాడు. ప్రాణాపాయ స్థితి లో ఉన్న రవిని కాపాడిన సాంబయ్యను గ్రామస్థులు అభినందించారు.