హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): సిద్దిపేట జిల్లా కొండపాకలో నిర్వహిస్తున్న ఆనంద నిల యం వృద్ధాశ్రమం గురించి ఇంటర్ ఇంగ్లిష్ పాఠ్యపుస్తకంలో పాఠ్యాంశంగా చేర్చినందుకు ఆశ్రమ సలహాదారు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి శనివారం ఒక ప్రకటనలో హర్షం ప్రకటించారు. ఇందుకు ఇంటర్బోర్డువారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ వృద్ధాశ్రమంలో అనాథ బాలలకు కూడా ఆశ్రమం కల్పిస్తున్నారు. ఇంటర్లో పాఠ్యాంశంగా పెట్టడం వల్ల తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవాలనే భావన చిన్న నాటి నుంచే పిల్లల్లో కలుగుతుందని తెలిపారు.