హనుమకొండ చౌరస్తా, జనవరి 5: లంచం తీసుకుంటూ కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఏసీబీకి పట్టుబడ్డారు. పెండెం రాజేందర్ అనే కాంట్రాక్టర్ కాకతీయ యూనివర్సిటీ హాస్టళ్లలో పాలు, పెరుగు సరఫరా చేస్తుంటారు. మే, ఏప్రి ల్ నెలలకు సంబంధించిన రూ.9 లక్షల బిల్లులు పెండింగ్లో ఉండగా, వాటిని మంజూ రు చేసేందుకు అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఆడిట్ ఆఫీసర్ సంగసారపు కిష్ట య్య లంచం డిమాండ్ చేశారు. శుక్రవారం కిష్టయ్య కాంట్రాక్టర్ రాజేందర్ నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. కిష్టయ్య భార్య ఆర్ట్స్ కాలేజీలో పార్ట్టైం లెక్చరర్గా పనిచేస్తున్నారు.