కుటుంబసభ్యులను ఓదార్చిన మంత్రి కేటీఆర్
కేపీహెచ్బీ కాలనీ, జూన్ 15: గుండెపోటుతో మృతిచెందిన టీఆర్ఎస్ పార్టీ బీమా విభాగం బాధ్యుడు కావేటి లక్ష్మీనారాయణ భౌతిక కాయానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు ఘనంగా నివాళి అర్పించారు. మంత్రి కేటీఆర్ మంగళవారం కూకట్పల్లిలోని కావేటి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్కుమార్ తదితరులు కావేటి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. కావేటి అంత్యక్రియలు మంగళవారం నిర్వహించారు. సాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి, ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ వీ ప్రకాశ్, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే వాసుదేవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ లీగల్సెల్ హెడ్ భరత్కుమార్, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ పాటిమీది జగన్మోహన్రావు, కార్పొరేటర్లు పగడాల శిరీష బాబూరావు, మందడి శ్రీనివాస్రావు, ముద్దం నర్సింహయాదవ్, ఆవుల రవీందర్రెడ్డి, సబీహాబేగం, సతీశ్గౌడ్, మాజీ కార్పొరేటర్ శ్రావణ్కుమార్, బాబూరావు, కూకట్పల్లి జోనల్ కమిషనర్ వీ మమత, డీసీ రవికుమార్ తదితరులు నివాళులర్పించారు.