అటకెక్కిన ఆరు గ్యారెంటీలు.. ఎగవేసిన హామీలు.. అతీగతీ లేని డిక్లరేషన్లు.. మాటమార్చిన మ్యానిఫెస్టో! అధికారం కోసం అలవికాని హామీలిచ్చిన కాంగ్రెస్.. ఏరుదాటాక తెప్ప తగలేసింది. 420 హామీలు నెరవేర్చకపోగా, పలు సంక్షేమ పథకాలను నీరుగార్చింది. కాంగ్రెస్ పాలనకు నేటితో వెయ్యిరోజులు! ఈ దగాపాలనపై బీఆర్ఎస్ పోరుబాట చేపట్టనున్నది. ధోకేబాజ్ కాంగ్రెస్ వంచనను ప్రజాక్షేత్రంలో ఎండగట్టనున్నది.
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల దగా పాలనపై బీఆర్ఎస్ పోరుబాట పట్టనున్నది. అలవికాని హామీలు ఇచ్చి వెయ్యి రోజులు గడిచినా అమలు చేయకుం డా ప్రజలను మోసం చేసిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై చార్జ్షీట్ వేయనున్నది. బుధవారం ఉదయం 11గంటలకు తెలంగాణ భవన్లో కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు చార్జ్షీట్ను విడుదల చేయనున్నారు. చార్జ్షీట్తోపాటు 420 హామీలు, ఆరు గ్యారెంటీల అమలును ప్రశ్ని స్తూ ఈ నెల 8వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా వరుస నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు బీఆర్ఎస్ సేన సిద్ధమైంది.
చార్జ్షీట్తో మొదలయ్యే ఈ పోరాటాన్ని ప్రజాఉద్యమంగా మార్చాలని బీఆర్ఎస్ వ్యూహం రచించింది. బుధవారం నుంచి ధర్నాలు, రైతు సదస్సులు, వంటావార్పులు, యువత ర్యాలీలు, ఆటో ర్యాలీలు, ప్ర జావాణి వినతిపత్రాలు.. ఇలా ప్రతిరోజూ ఒకో అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చుట్టుముట్టేలా బీఆర్ఎస్ కార్యాచరణను సిద్ధం చే సింది. ఈ మేరకు మాజీ మంత్రులు, రాష్ట్ర నేతలు ఎక్కడికక్కడ పార్టీ సన్నాహక సమావేశాల ద్వారా శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.