జనగామ: బీఆర్ఎస్ పార్టీ జనగామ (janagama) జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి(Pagala Sampath Reddy) పార్థివదేహానికి మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) నివాళులు(Tribute) అర్పించారు. సంపత్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. సంపత్రెడ్డి అకాల మరణం కలిచివేసిందని, ఆయన మృతి పార్టీకి తీరని లోటన్నారు. కాగా, సంపత్రెడ్డి (55) సోమవారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. హనుమకొండలోని తన నివాసంలో చాయ్ తాగిన కొద్దిసేపటికే గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు.
వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జనగామ జిల్లా చిల్పూరు మండలం రాజవరం గ్రామానికి చెందిన సంపత్రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడిగా బీఆర్ఎస్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, రాజయ్య తదితరులు ఉన్నారు.