హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ)/సిరిసిల్ల రూరల్: రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు మరోసారి ఉదారతను చాటుకొన్నారు. విదేశాల్లో జరిగే క్రీడాటోర్నీలో పాల్గొనేందుకు ఓ గిరిజన విద్యార్థికి ఆర్థికసాయంతోపాటు ఓ పేద విద్యార్థి చ దువుకయ్యే ఖర్చును భరించేందుకు ముందుకొచ్చి గొప్ప మనసు చాటారు. హైదరాబాద్లో బీటెక్ సెకండియర్ చదువుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లికి చెందిన కొలపురి శిల్పకు లాప్టాప్ కోసం రూ.50 వేలు ఇచ్చారు. ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు అందించాలని అధికారులను ఆ దేశించారు. మంగళవారం ప్రగతిభవన్లో ముగ్గురికి ఆర్థిక సాయం అందించి, మరింత ఉన్నత స్థానాలకు ఎదగడం ద్వారా రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేయాలని ఆకాంక్షిం చారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెం దిన హ్యాండ్బాల్ ప్లేయర్ మాధవి కరీనా ఈ నెల 18 నుంచి కజకిస్థాన్లో జరిగే మహిళల ఆసియా యూత్ హ్యాండ్బాల్ టోర్నీ పాల్గొనా ల్సి ఉన్నది. ఆర్థిక సమస్యల కారణంగా టోర్నీ లో పాల్గొనలేని పరిస్థితి ఏర్పడటంతో విష యం తెలుసుకొన్న మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. స్థానిక గిరిజన సంక్షేమ పాఠశాలలో చదువుకొన్న మాధవి తల్లిదండ్రులు వ్య వసాయ కూలీలు. ఇప్పటికే ఆమె అనేక రాష్ట్రస్థాయి టోర్నమెంట్లలో పాల్గొని పతకాలు సాధించింది.
అంబర్పేట్కు చెందిన సంకురు మణిదీప్ 98.6 శాతం మార్కులతో ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణుడై జేఈఈ అడ్వాన్స్ పరీక్షల్లో విజయం సాధించాడు. గువాహటి ఐఐటీలో బీటెక్ సీట్ సాధించాడు. తండ్రి రోజు కూలీ కాగా, తల్లి గృహిణి. ఎంతో కష్టంతో అడ్మిషన్ ఫీజు రూ.35 వేలు చెల్లించినప్పటికీ హాస్టల్లో వసతి, భోజన ఖర్చులకు తీవ్ర ఇబ్బంది కలుగడంతో అడ్మిషన్ పొందినప్పటికీ అక్కడికి వెళ్లి చదువుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్, వెంటనే అతడిని ప్రగతిభవన్కు పిలిపించి అవసరమైన ఆర్థిక సాయంతోపాటు ఒక ల్యాప్టాప్ అందించారు. మంత్రి ఉదారత పట్ల మాధవి, మణిదీప్, శిల్ప ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.