హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): ఫోరెన్సిక్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్)లో శనివారం జరిగిన భారీ అగ్నిప్రమాదం వెనుక కుట్ర ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అనుమానం వ్యక్తంచేశారు. ఓటుకు నోటు కేసులోని కీలక ఆడియో ఫైల్స్, కేసు సాక్ష్యాలను నాశనం చేయడానికే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని సందేహం వ్యక్తంచేశారు.
‘ప్రముఖ ఓటుకు నోటు కేసుకు సంబంధించిన వాయిస్ రికార్డింగ్లను, అలాగే ఫోన్ట్యాపింగ్ వంటి కల్పిత రాజకీయ కేసుల్లో సాక్ష్యాధారాల లోపాన్ని కప్పిపుచ్చడానికి చేస్తున్న ప్రయత్నంగానే ఈ ప్రమాదం అని నేను భావిస్తున్నాను’ అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.