కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారానికి రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన డాక్టర్ పత్తిపాక మోహన్ ఎంపికవడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా మోహన్కు మంత్రి గురువారం అభినందనలు తెలిపారు.
కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారానికి మా సిరిసిల్ల బిడ్డ డాక్టర్ పత్తిపాక మోహన్ ఎంపికవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గాంధీజీపై ఆయన రాసిన ‘బాలల తాతా బాపూజీ’ గేయ కథకు ఈ పురస్కారం దక్కడం హర్షనీయమన్నారు.