హైదరాబాద్: ప్రముఖ జానపద కళాకారుడు బలగం మొగులయ్య మృతిపట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంతాపం వ్యక్తం చేశారు. ఆయన పాటకు చలించని హృదయం లేదన్నారు. పాట ద్వారా తెలంగాణ ప్రేమైక జీవనాన్ని ఆవిష్కరించారని చెప్పారు. మాయమైపోతున్న కుటుంబ సంబంధాలను మళ్లీ గుర్తుచేశారన్నారు. మొగులయ్య మరణించినా పాట రూపంలో బతికే ఉంటారని చెప్పారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.
‘నీ పాటకు చెమర్చని కళ్ళు లేవు, చలించని హృదయం లేదు. నీ పాట ద్వారా తెలంగాణ ప్రేమైక జీవనాన్ని ఆవిష్కరించావ్. మాయమైపోతున్న కుటుంబ సంబంధాలను మళ్లీ గుర్తు చేసింది. మొగులన్నా.. నీ పాట తెలంగాణ బలగాన్ని మళ్లీ చాటింది. మానవీయకోణాన్ని ఆకాశమంత ఎత్తులో నిలిపింది. మొగులయ్య గారు మరణించినా పాట రూపంలో బతికే ఉంటారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలి’ అని ట్వీట్ చేశారు.
నీ పాటకు
చెమర్చని కళ్ళు లేవు
చలించని హృదయం లేదునీ పాట ద్వారా
తెలంగాణ ప్రేమైక జీవనాన్ని ఆవిష్కరించావ్
మాయమైపోతున్న కుటుంబ సంబంధాలను మళ్లీ గుర్తు చేసింది!మొగులన్నా..
నీ పాట తెలంగాణ బలగాన్ని మళ్లీ చాటింది!
మానవీయకోణాన్ని ఆకాశమంత ఎత్తులో నిలిపింది!మొగులయ్య గారు మరణించినా… pic.twitter.com/FA265fYaNi
— KTR (@KTRBRS) December 19, 2024