హైదరాబాద్, ఆగస్ట్14 (నమస్తే తెలంగాణ): ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభించడమే కాదు.. కాంక్రీట్ పనులు మినహా సివిల్ పనులన్నింటినీ పూర్తిచేసిందని కృష్ణా నదీ యాజమాన్య మండలి (కేఆర్ఎంబీ) పరిశీలన బృందం వెల్లడించింది. దీంతో ఇంతకాలం తాము కేవలం ఇన్వెస్టిగేషన్ పనులు, జియోలాజికల్ సర్వే మాత్రమే చేస్తున్నామని, డీపీఆర్ల కోసమే తవ్వకాలు జరుపుతున్నామంటూ ఏపీ ప్రభుత్వం చేస్తున్న వాదన బూటకమని తేలిపోయింది. అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిందని పేర్కొంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో తెలంగాణ పిటిషన్ దాఖలుచేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఎన్జీటీ.. ప్రాజెక్టు ప్రదేశాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ నెల 13లోగా నివేదిక ఇవ్వాలని కేఈఆర్ఎంబీని ఆదేశించింది. ఈ మేరకు కేఆర్ఎంబీ శనివారం రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల ఫొటోలతో మిగతా 2వ సీమ లిఫ్ట్ పచ్చి నిజం సహా 12 పేజీల నివేదికను ఎన్జీటీకి సమర్పించింది.
నివేదికలో కేఆర్ఎంబీ బృందం వెల్లడించిన ము
ఖ్యమైన అంశాలు:
రాయలసీమ ఎత్తిపోతల పథకం లో భాగంగా శ్రీశైలం రిజర్వాయటర్ 800 ఫీట్ల నుంచి 8.8 కిలోమీటర్ల పొడవున తవ్వాల్సిన అప్రోచ్ చానల్ పనులన్నీ పూర్తయ్యాయి. ఫోర్బే ప్రాంతానికి, అప్రోచ్ చానల్కు మధ్య 15 మీటర్ల తవ్వకం పనులు మాత్ర మే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే తవ్వి న అప్రోచ్ చానల్లోకి వచ్చిన నీటి ఆధారంగా దీనిని అంచనావేశాము.
అప్రోచ్ చానల్ ఫోర్బేను 237 మీటర్ల పొడవున నిర్మించారు. ఫో ర్బే లోతు 150 నుంచి 180 మీ టర్ల వరకు ఉండవచ్చు. ఫోర్బే గోడలకు ఇరు పక్కల షాట్క్రీటిం గ్ పనులు మొదలయ్యాయి.
250 మీటర్ల పొడవు, 40 మీటర్ల వెడల్పుతో, 730 అడుగుల లోతు తో ఏర్పాటుచేయాల్సిన పంప్హౌస్కు సంబంధించిన తవ్వకాలన్నీ పూర్తయ్యాయి. 12 పైప్లైన్లు ఏ ర్పాటుచేయాల్సి ఉండగా ఇప్పటికే 10 పైప్లైన్ల కోసం 5 మీటర్ల వ్యా సార్థ్యంతో 35 నుంచి 50 మీటర్ల వరకు తవ్వకాలు పూర్తయ్యాయి. షాట్క్రీటింగ్ పనులు కూడా మొదలయ్యాయి.
డెలివరీ సిస్టర్న్ నిర్మాణానికి సంబంధించిన తవ్వకాలన్నీ పూర్తయ్యాయి. అఅక్కడి నుంచి శ్రీశైలం కుడి ప్రధాన కాలువను కలుపుతూ సుమారు 500 మీటర్ల లింక్ కెనాల్ను సైతం తవ్వారు.
కాంక్రీట్ పనుల కోసం ప్రాజెక్టు సైట్లో రెండ్ సిమెంట్ మిక్సింగ్ ప్లాంట్లను ఏర్పాటుచేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన కంకర, ఇసుకను కూడా ఇప్పటికే సిద్ధంచేశారు.
ప్రాజెక్టును సందర్శించిన సందర్భంలో అక్కడ ఎలాంటి పనులు జరగడం లేదు. డెలివరీ సిస్టర్న్పై భాగంలో మాత్రం కొన్ని షెడ్లు నిర్మించి ఉన్నాయి.
క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించినప్పుడు కేంద్ర జల్శక్తి మార్గదర్శకాల (2010) ప్రకారం డీపీఆర్ తయారీ కోసం చేపట్టాల్సిన పనుల కన్నా ఎన్నో రెట్ల స్థాయిలో పనులు జరిగాయి.