కవాడిగూడ, నవంబర్ 7: హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం సోమవారం వైభవంగానిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా సీఎం కేసీఆర్ సతీమణి శోభ, మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ హాజరై పూజలు చేశారు. రచన టెలివిజన్, భక్తి టీవీ సంయుక్త ఆధ్వర్యంలో వర్గల్ శారదా వైదిక స్మార్త వేదపాఠశాల విద్యార్థుల వేదపఠనంతో మహాశివలింగానికి ప్రదోషకాల అభిషేకం నిర్వహించారు. జ్వాలాతోరణ మహోత్సవం, ఉజ్జయిని మహాకాళేశ్వర భస్మహారతి, మైసూరు దత్తపీఠం పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానందస్వామి అనుగ్రహ భాషణం, కోటి దీపోత్సవం నిర్వాహకులు నరేంద్ర చౌదరి దంపతులతో కార్తిక దీపారాధన, భక్తులతో దీపారాధన కార్యక్రమాలను జరిపారు.