హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈ నెల 8 నుంచి 10 వరకు నిర్వహించనున్న 17వ ప్రవాసీ భారతీయ దివస్కు తెలంగాణ నుంచి తొలి ప్రతినిధిగా ప్రవాస భారతీయుల హకుల పరిరక్షణ వేదిక అధ్యక్షుడు కోటపాటి నరసింహంనాయుడు హాజరుకానున్నారు.
గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి భారత్కు తిరిగి వచ్చిన జనవరి 9వ తేదీని విదేశీ వ్యవహారాలశాఖ ప్రతి రెండేండ్లకోసారి ప్రవాసీ భారతీయ దివస్గా నిర్వహిస్తున్న ది. ఇప్పటివరకు 16 సార్లు ఈ వేడుకలు జరిగాయి.
ఈ ఏడాది ఇండోర్లో జరిగే వేడుకలకు ఎన్నారైలు, వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు రానున్నారు. విదేశాల్లో భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి ప్రభుత్వ స్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నట్టు కోటపాటి నరసింహం నాయుడు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.