మెట్పల్లి, డిసెంబర్ 15 : ఫార్మాసిటీని ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేయాలని నిర్ణయించడం దారుణమని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కాలుష్యరహిత ఫార్మాసిటీ ఏర్పాటుకు నిర్ణయిస్తే మెజార్టీ రైతులు భూములు ఇచ్చినట్టు ఆయన పేర్కొన్నారు.
ప్రజాభీష్టం మేరకే ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తామని అప్పటి ప్రభుత్వం స్పష్టం చేసిందని, కానీ కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మాసిటీని రద్దు చేయాలనుకోవడం సరికాదని ‘ఎక్స్’ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.
ఫార్మాసిటీ ద్వారా తెలంగాణ ప్రజలకు ప్రత్యక్షంగా 5 లక్షలు, పరోక్షంగా 10 లక్షల ఉద్యోగా అవకాశాలు వచ్చేవని, ఈ ప్రాజెక్ట్ కేసీఆర్ మానసపుత్రికగా ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే యావత్ ప్రజానీకం హర్షిస్తుందని తెలిపారు.