దేవరకొండ, మే 26: నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల నమస్తే తెలంగాణ విలేకరి జాజాల శ్రీనివాసులు(43) బ్లాక్ఫంగస్తో మృతిచెందారు. 10 రోజుల కిందట ఆయనకు కరోనా రాగా.. పలు దవాఖానల్లో చికిత్స పొందారు. శ్రీనివాసులుకు బ్లాక్ఫంగస్ వచ్చినట్టు వైద్యులు గుర్తించారు. చికిత్స కోసం గాంధీ దవాఖానకు తరలించగా.. బుధవారం మృతిచెందారు. ఎమ్మెల్యే రవీంద్రకుమార్ సంతాపం తెలిపారు.