హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్కు సంబంధించిన కేసులో ఆయన వ్యక్తిగత డ్రైవర్ను పోలీసులు కిడ్నాప్ చేసి, అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. సుమంత్ వద్ద డ్రైవర్గా పనిచేస్తున్న వ్యక్తిని ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. తెల్లాపూర్లోని సుమంత్ నివాసం సమీపంలో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్టు వార్తలు వెలువడ్డాయి. ఎక్కడ అదుపులోకి తీసుకున్నారనే విషయంపై స్పష్టత రాలేదు.
బోడుప్పల్ వ్యాపారి గొంగిడి హరికృష్ణ తనపై ఇనుప రాడ్లు, కర్రలతో దాడి చేశారని, తనను బెదిరించి రూ.10 కోట్లు డిమాండ్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో తన ఎడమచేతికి ఫ్రాక్చర్తోపాటు ఇతర గాయాలయ్యాయని హరికృష్ణ ఆరోపించారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ కేసులో సుమంత్తోపాటు రాము, ప్రశాంత్, అరుణ్కుమార్రెడ్డి, కార్తీక్, మహేందర్రెడ్డి తదితరులపై కేసు నమోదైంది. తొలుత మేడ్చల్-మలాజిగిరి కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీస్స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు కాగా, తర్వాత కేసును జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్కు బదిలీ చేశారు.