హైదరాబాద్, సెప్టెంబర్19 (నమస్తే తెలంగాణ): ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పదో వర్ధంతిని బీసీ రాజ్యాధికార సమితి కేంద్ర కార్యాలయంలో ఈ నెల 21న నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి బాగ్లింగంపల్లిలోని కేంద్ర కార్యాలయంలో సమితి కోర్ కమిటీ సభ్యులు సోమవారం సమావేశమయ్యారు. తెలంగాణతోపాటు అనేక ఉద్యమాలకు ఊపిరిలూది భావినాయకులను తయారుచేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ నేటి తరానికి ఆదర్శప్రాయుడని పేర్కొన్నారు. ఈ నెల 21న జలదృశ్యం వద్ద ఉదయం 10 గంటలకు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. అన్ని పార్టీల ప్రముఖులు, తెలంగాణ మేధావులు, విద్యావంతులు, ఉద్యమకారులు, కవులు, కళాకారులు, విద్యార్థి, మహిళా నాయకులు హాజరు కావాలని కోరారు. ఈ సమావేశంలో దొనేటి కృష్ణ లత, సమితి కన్వీనర్ దాసు సురేశ్, కోర్ కమిటీ సభ్యులు సంగెం సూర్యారావు , చాపర్తి కుమారస్వామి, బోనం ఊర్మిళ, రావిరాల సంధ్య, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.