చేర్యాల, జనవరి 27: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. క్షేత్రంలో గత ఆదివారం పట్నం వారం నేత్రపర్వంగా జరిగింది. ఈ ఆదివారం(నేడు) లష్కర్ వారానికి సికింద్రాబాద్ భక్తులతోపాటు కరీంనగర్, మెదక్, వరంగల్ ఉమ్మడి జిల్లాలకు చెందిన వేలాది మంది భక్తులు తరలిరానున్నారు.
ఈ ఉత్సవాల్లో సికింద్రాబాద్ భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మల్లన్నను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. దీంతో బ్రహ్మోత్సవాల్లో రెండో ఆదివారాన్ని లష్కర్ వారంగా అనాదిగా పిలుస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు.