హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ సోదర సోదరీమణులకు పురపాలక, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రకృతితో సామరస్యంగా జీవిస్తూ, సంప్రదాయ సంస్కృతిని కాపాడుకొంటూ, మీ హక్కులను నొక్కి చెప్పే మీరు మాకు స్ఫూర్తి. తెలంగాణలోని ఆదివాసీల ఆత్మగౌరవం ప్రతిబింబించేలా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో నిర్మించిన కుమ్రంభీం ఆదివాసీ భవన్ను త్వరలోనే ప్రారంభిస్తాం’ అని పేర్కొన్నారు. గూడెంలను కొత్త గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్ది ఆదివాసీలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన మావా నాటే, మావా రాజ్ (మన తండాలో మన రాజ్యం) హామీని సీఎం కేసీఆర్ నెరవేర్చారని చెప్పారు. జోడే ఘాట్లో కుమ్రంభీం మ్యూజియంను ఏర్పాటు చేశామని, అలాగే ఆసిఫాబాద్ జిల్లాకు కుమ్రంభీం జిల్లా అని నామకరణం చేశామని పేర్కొంటూ ఆయన వరుస ట్వీట్లు చేశారు.
హ్యాపీ బర్త్డే మహేశ్
సినీ నటుడు మహేశ్బాబుకు మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘నాకు తెలిసిన అత్యంత వినయపూర్వకమైన సూపర్స్టార్, అద్భుతమైన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న మిత్రుడు మహేశ్బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు. భగవంతుడు మహేశ్కు మంచి ఆరోగ్యం, మానసిక శాంతిని ప్రసాదించాలని కోరుకుంటున్నా’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.