మహబూబ్నగర్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగిన యూట్యూబర్ కర్నె శిరీష (బర్రెలక్క) నాలుగో స్థానంలో నిలిచారు. ఆమెకు మొత్తం 5,754 ఓట్లు పోలయ్యాయి. నిరుద్యోగుల తరఫున అసెంబ్లీలో తన గళం వినిపిస్తానంటూ ఆమె ఎన్నికల బరిలో నిలిచారు. కానీ జనం ఆమెను ఆదరించలేదు.
కాగా, కొల్లాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు విజయం సాధించారు. ఆయనకు మొత్తం 93,609 ఓట్లు పోలయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్రెడ్డికి 63,678 ఓట్లతో రెండో స్థానంలో ఉండగా, బీజేపీ అభ్యర్థి అల్లేని సుధాకర్రావు 20,389 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.