హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): గ్రీన్ ఇండియా చాలెంజ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ కొవిడ్ నుంచి త్వరగా కోలుకోవాలని ఆదివారం హైదరాబాద్లోని నల్లకుంట పాతరామాలయంలో సంజీవని మహా మృత్యుంజయ హోమం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు అనంతాచార్యులు ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కోఫౌండర్ రాఘవ, ప్రతినిధి కిశోర్గౌడ్, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్రెడ్డి తదితరులు హోమం నిర్వహించారు. సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులు త్వరగా కోలుకొని రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని ప్రత్యేక పూజలు చేశారు. సికింద్రాబాద్లోని ప్రాచీన గణపతి దేవాలయంలోనూ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ మృత్యుంజయ హోమం జరిపించారు. సోమశేఖరశర్మ ఆధ్వర్యంలో 11 మంది రుత్విక్కులు యాగం నిర్వహించారు.