రవీంద్రభారతి, మే 10: తెలంగాణ రాష్ట్ర పూసల సంఘం అధ్యక్షుడిగా కోల శ్రీనివాస్ ఎన్నికయ్యారు. మంగళవారం జరిగిన ప్రత్యేక ఓటింగ్లో 33 జిల్లాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. గుంటిపల్లి వెంకట్ ప్యానల్పై కోల శ్రీనివాస్ ప్యానల్ గెలుపొందింది. పూసల సంఘం ప్రధాన కార్యదర్శిగా శేని వెంకటేశం, కోశాధికారిగా కంచి మధుసూదన్, ఉపాధ్యక్షురాలిగా కోనేటి నాగమణి, కార్యవర్గ సభ్యులుగా ఆవుల రవికుమార్, గంట్ల కృష్ణ, పసుపులేటి అజయ్కుమార్ ముద్ర, కోల వెంకటేశ్, పన్నీరు సతీశ్, పసుపులేటి ప్రసాద్, పోలేపల్లి నరేశ్, చిన్నపల్లి అభినయ్ ఎన్నికయ్యారు.