హైదరాబాద్, ఏప్రిల్ 25(నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్ ఫలితాల్లో డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్స్ పూర్వ విద్యార్థులు వివిధ క్యాటగిరీలలో మొదటి 100లోపు ర్యాంకుల్లో 17 ర్యాంకులు సాధించి సత్తా చాటారని ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. తోటంశెట్టి నికిలేశ్ ఆలిండియా 3వ ర్యాంకు, అరిపికట్ల తేజస్వి 8వ ర్యాంకు, పీ విద్యప్రవీణ్ 14వ ర్యాంకు, సతివాడ జ్యోతిరాధిత్య 17వ ర్యాంకు సాధించినట్టు పేర్కొన్నారు.
మొదటి 100 లోపు ర్యాంకుల్లో వివిధ క్యాటగిరీలలో 3, 8, 14, 17, 20, 21, 23, 28, 31, 35, 41, 48, 55, 56, 69, 84, 99 ర్యాంకులు కైవసం చేసుకొన్నట్టు వివరించారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అధ్యాపక సిబ్బందికి అభినందనలు తెలిపారు.