హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రింట్ మీడి యా డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యలన్నీ పష్కారమయ్యేందుకు కృషి చేస్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హామీ ఇచ్చారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రింట్ మీడి యా డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ప్రథమ మహాసభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే బొజ్జా మాట్లాడుతూ.. తాను కూడా గతంలో పేపర్ బాయ్గా పనిచేశానని.. ఈ రంగంలో ఉన్న కష్టాలన్నీ అనుభవించానని చెప్పారు.
యాజమాన్యాల ఆదేశాలతో ఏజెంట్లు.. వారి ఆదేశాలతో పేపర్ బాయ్స్ టాస్క్ పూర్తి చేయడంలో సతమతమవుతున్నారని అన్నారు. ‘నేను పేపర్ బాయ్ నుంచి ఎమ్మెల్యేగా ఎదగడం చాలా గర్వంగా ఉంది. నా డిగ్రీ సమయంలో పేపర్ వేసేవాణ్ని. అప్పుడు నెలకు రూ.3 వందల వరకు ఇచ్చేవాళ్లు. అలా కష్టపడి చదువుకున్నాను. ఓ పత్రికలో రిపోర్టర్గా కూడా పనిచేసిన అనుభవం నాకుంది. ఈ రంగం నాకు కష్టాలను ఎదుర్కోవడం నేర్పించింది’ అని చెప్పారు. మీడియా ప్రజల తరపున ఉండాలని కోరారు. సీఎం రేవంత్రెడ్డి తనను నమ్మి అవకాశం ఇవ్వడం గొప్ప విషయమని చెప్పారు. అసోసియేషన్ సమస్యలన్నింటిని సీఎం దృష్టికి తీసుకెళ్లీ పరిష్కారం దిశగా పనిచేస్తానని భరోసా ఇచ్చారు.
ఉద్యమాల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని ఆలిండియా న్యూస్ పేపర్ వెండర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు సునీల్ పాఠంకర్ చెప్పారు. మహారాష్ట్రలో అనేక ఉద్యమాలు చేసి పేపర్ బాయ్స్ కోసం ప్రభుత్వం సేఫ్టీ షెడ్లను ఏర్పాటు చేసేలా కృషి చేశామని చెప్పారు. వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుకు కూడా ప్రభుత్వం అధ్యయన కమిటీ వే సి నివేదికను శాసనభకు అందించిందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ రంగానికి చెందిన వారందరూ ఐక్యంగా ఉంటూ సమస్యలు పరిష్కరించుకోవాలని అన్నారు. తెలంగాణ ప్రింట్ మీడియా డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వనమా సత్యం మాట్లాడు తూ.. కరోనా లాంటి క్లిష్ట సమయంలో ప్రజలకు పేపర్ చేర్చిన ఘనత పేపర్ బాయ్స్ది అని కొనియాడారు.
డిస్ట్రిబ్యూటర్స్ కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వారికి విద్యుత్తు వాహనాలను కూడా సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉందని అన్నారు. ప్రతి జిల్లాలో డిస్ట్రిబ్యూటర్ కో ఆపరేటివ్ సొసైటీలు ఏర్పాటుచేసి రుణా లు ఇప్పించాలని కోరారు. ప్రతి జిల్లాలో పత్రికల అమ్మకందార్లకు స్ఫూర్తిగా దివంగత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. నమస్తే తెలంగాణ దినపత్రిక సర్క్యులేషన్ జీఎం రాంరెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఉద్యమం కోసం పనిచేశామని ఇకపై మ నకోసం పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇప్పటివరకు హైదరాబాద్కే పరిమితమైన కార్యకలాపాలను రాష్ట్రవ్యాప్తంగా తీసుకపోవడం గొప్ప విషయమని అన్నారు. ఈ రంగంలో మనకు ఆశించిన స్థాయిలో గుర్తింపు లేదని.. ఇకపై గుర్తింపు వచ్చేలా అం దరూ ఐక్యతతో పనిచేయాలని సూచించారు. పేపర్ గర్ల్స్ ప్రమీల, పవిత్ర సిస్టర్స్ను ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు శాలువతో సత్కరించారు. అసోసియేషన్ డైరీ, క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆలిండియా న్యూస్ పే పర్ ఏజెంట్ అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి పీకే సత్తార్, దినపత్రికల జీఎంలు, జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.