మామిళ్లగూడెం, ఫిబ్రవరి 4: ఖమ్మం నగరంలో అక్రమంగా నివాసం ఉంటున్న నలుగురు బంగ్లాదేశీయులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్దత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 19 ఏండ్ల క్రితం దేశంలోకి అక్రమంగా ప్రవేశించి ఖమ్మం నగరానికి చేరుకొని తప్పుడు సమాచారంతో ఆధార్కార్డు, పాస్పోర్టు, పాన్కార్డ్ పొందిన నలుగురు బంగ్లాదేశీయులను ఖమ్మం త్రీటౌన్ పోలీస్ అరెస్ట్ చేశారు.
వారిని విచారించగా బంగ్లాదేశ్లోని శ్యామ్కుర్ యూనియన్ జెనైదా జిల్లా మహేశ్పుర్ సబ్ జిల్లా డకాటియాకు చెందిన మహమ్మద్ నూర్నబీ అలియాస్ షేక్ నూర్నబీ, మహమ్మద్ సాగర్ అలియాస్ బోడ సాగర్, షేక్ జమీర్ అలియాస్ మహమ్మద్ జమీర్, మహమ్మద్ అమినూర్ మండల్గా గుర్తించారు. వీరందరూ 19 ఏండ్ల క్రితం బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా బెంగళూరుకు వచ్చారు. అకడే సెంట్రింగ్ పని చేసుకుంటూ జీవించారు. కోల్కతాకు చెందిన మిత్రుడి ద్వారా ఆరేండ్ల క్రితం ఖమ్మం నగరానికి వ చ్చారు. ఇకడే సెంట్రింగ్ పని చేసుకుంటూ జీవిస్తున్నారు. మొదటి ముగ్గురు తప్పుడు సమాచారంతో ఆధార్కార్డులు పొందారు.