ఖైరతాబాద్లో కొలువుదీరిన శ్రీపంచముఖ రుద్ర మహాగణపతి భక్తులకు దర్శనమిచ్చేందుకు సిద్ధమయ్యారు. ఏటా వినాయకచవితికి ముందు రోజు నుంచి దర్శనమిచ్చే ఖైరతాబాద్ గణేశుడు ఈసారీ అలాగే భక్తులకు దర్శనమివ్వనున్నారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది విగ్రహం ఎత్తును 40 అడుగులకే పరిమితం చేశారు. ఆదివారం విగ్రహం ముందున్న కర్రలను తొలగించడంతో భక్తులు చవితికి ముందే దర్శించుకొని సెల్ఫీలతో సంబరపడుతున్నారు. -ఖైరతాబాద్