చిక్కడపల్లి, మే19 (నమస్తే తెలంగాణ) : కేంద్రప్రభుత్వం రాష్ర్టాల హక్కులను కాలరాస్తున్నదని కేరళ ఆర్థిక మంత్రి కే ఎన్ బాలగోపాల్ అన్నారు. గురువారం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన పుచ్చలపల్లి సుందరయ్య 37వ స్మారకోపన్యాస సభలో “ఫెడరలిజం రాజ్యాంగ సూత్రా లు – ముంచుకొచ్చిన ప్రమాదం” అనే అంశంపై ఆయన మాట్లాడారు.
దేశంలో సమాఖ్య విధానాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని బాలగోపాల్ చెప్పారు. అభివృద్ధి కోసం రాష్ర్టాలకు అప్పులు చేసుకునే వీలు లేకుండా కేంద్రం ఆంక్షలు విధిస్తున్నదన్నారు. కేంద్రం వివక్ష చూపుతూ కేరళ, తెలంగాణ, తమిళనాడు రాష్ర్టాలకు తక్కువ నిధులు కేటాయించిందని చెప్పారు. సమావేశంలో నంద్యాల నర్సింహారెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు.