హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటుచేసి ఆవిషరించిన ప్రపంచంలోనే అతి పెద్ద 125 అడుగుల బాబాసాహెబ్ మహా విగ్రహావిషరణ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన అంబేదర్ మనుమడు, లోక్సభ మాజీ సభ్యుడు ప్రకాశ్ అంబేదర్ శుక్రవారం ప్రగతి భవన్కు వచ్చారు. తన ఆహ్వానం మేరకు ప్రగతి భవన్కు వచ్చిన ప్రకాశ్ అంబేదర్ను సీఎం కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. శాలువాతో సతరించి పూలగుచ్ఛం అందజేశారు. ఇష్టాగోష్టిగా చర్చించారు. ప్రకాశ్ అంబేద్కర్కు సీఎం కేసీఆర్ మధ్యాహ్నం భోజనంతో అతిథ్యమిచ్చారు. ప్రకాశ్ అంబేద్కర్కు స్వాగతం పలికిన వారిలో ఎంపీలు సంతోష్కుమార్, రంజిత్రెడ్డి, విప్ బాల సుమన్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీలు పాడి కౌశిక్రెడ్డి, మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్, బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, శంకరన్న ధోంగ్డే, సిద్దోజీరావు, మాణిక్ కదం తదితరులు ఉన్నారు. భోజనం అనంతరం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో కలిసి ప్రకాశ్ అంబేద్కర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు.
ప్రకాశ్ అంబేద్కర్కు సీఎం కేసీఆర్ సత్కారం
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా హైదరాబాద్ నగరం నడిబొడ్డున హుస్సేన్సాగర్ తీరాన 125 అడుగుల మహా విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రకాశ్ అంబేద్కర్తో కలిసి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆవిష్కరించారు. అంబేద్కర్ విగ్రహ శిలాఫలకాన్ని ప్రకాశ్ అంబేద్కర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బౌద్ధ భిక్షువులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ను రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ సభా వేదికపై శాలువా కప్పి, బుద్ధ విగ్రహంతో సత్కరించారు. ఆ తర్వాత బౌద్ధ భిక్షువులకు కాషాయ వస్ర్తాలను అందజేశారు.