సీఎం కేసీఆర్తోనే దేశం బాగుపడుతుందని, బీజేపీ ఆగడాలకు అడ్డుకట్ట వేయడం కేసీఆర్తోనే సాధ్యమవుతుందని సౌతాఫ్రికాలోని ఎన్నారైలు స్పష్టంచేస్తున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని ఆకాంక్షిస్తున్నారు. కేంద్రంలోని మోదీ సర్కారు, బీజేపీ విధానాలు దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న తరుణంలో విశాలభారత ప్రజాహితం మేరకు కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు చేసి దేశ భవిష్యత్కు బంగారుపునాదులు వేయాలని ఎన్నారైలు కోరుతున్నారు.
-హైదరారాబాద్, నమస్తే తెలంగాణ
తెలంగాణలోని సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి దేశంలోని అన్ని రాష్ర్టాల ప్రజలు తమకు కూడా అలాంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలు కావాలని కోరుతున్నారు. ఇటువంటి తరుణంలో సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లాలి. రాష్ట్రంలో సాగు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలను కల్పించి తెలంగాణను దేశానికే ఆదర్శంగా మలిచిన నాయకుడు కేసీఆర్.. జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే తప్పకుండా భారత దేశ ముఖచిత్రం మారిపోతుంది.
– హేమంత్ బల్మూరి
మాది మహారాష్ట్ర. నేను సౌతాఫ్రికాలో ఉంటున్న. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఎంత అభివృద్ధి చెందిందో చూస్తున్నాం. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని దేశవ్యాప్తంగా కోరుతున్నారు. మా రాష్ట్ర ఎన్నారైల పక్షాన కేసీఆర్కు సంపూర్ణమద్దతు ఇస్తున్నాం. 75 ఏండ్లలో ఎకువ కాలం జాతీయ పార్టీలుగా చెప్పుకొనే బీజేపీ, కాంగ్రెస్ పాలించినా.. దేశంలో గుణాత్మక మార్పు రాలేదు. పరిస్థితి నానాటికీ దిగజారింది. ఈ క్రమంలో కేసీఆర్ లాంటి దార్శనిక నాయకుడు దేశానికి అవసరం. కేసీఆర్ నాయకత్వంలో జాతీయ పార్టీ ఏర్పాటు ఒకటే పరిషారం.
– రాజేశ్ హిప్పారాజ్
మాది ఆంధ్రప్రదేశ్. ప్రస్తుతం నేను సౌతాఫ్రికాలో ఉంటున్నాను. 75 ఏండ్ల స్వతంత్ర భారతదేశం అన్ని రంగాల్లో వెనకబడిపోయింది. వ్యవసాయం, నీటిపారుదల, విద్య, వైద్యం రవాణా, పరిశ్రమలు, దేశవిదేశీ వ్యవహారాలు, రైతాంగ సమస్యలు ఇలా అన్ని రంగాలను ఇప్పటిదాకా దేశాన్ని పాలించిన నేతలు అధ్వాన్నం చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అడుగంటిపోయాయి. ఎల్ఐసీ, రైల్వే, బ్యాంకింగ్, విద్యుత్తు, బొగ్గు సంస్థలు అనేకం మోదీ ప్రైవేట్పరం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో సమకాలీన రాజకీయ వ్యవస్థ మార్పుతోనే దేశం పురోగమిస్తుంది. ఆ నాయకత్వం కేసీఆర్ చేతుల్లో ఉంటే దేశం బాగుపడుతుంది. – గానుగులవర ఈశ్వర భాసర్
దేశానికి ప్రత్యామ్నాయనేత సీఎం కేసీఆరే. దక్షిణాది నుంచి దేశ్కీ నేతగా కేసీఆర్ ఎదగాలని ఆశిస్తున్నాం. మతాల పేరిట దేశంలో చిచ్చుపెట్టే విధానాలు పోవాలంటే కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం అనివార్యం. కేసీఆర్ దేశానికి నాయకత్వం వహిస్తే తెలంగాణ సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేసే అవకాశాలుంటాయి. ఉత్తర, దక్షిణ ప్రాంతాలను అనుసంధానం చేసి, దేశంలో వృథా పోతున్న లక్షలాది టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకోవచ్చు.
– ప్రవీణ్కుమార్ కర్నాటి
దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ ప్రవేశం నూతన శకానికి నాంది కా బోతున్నది. చరిత్ర గతిని మలుపు తిప్పగల సామర్థ్యం గొప్ప రాజనీతిజ్ఞుడైన కేసీఆర్కే ఉన్నది. సమకాలీన సమస్యలపై ఆయనకు ఉన్న అవగాహన, విషయ పరిజ్ఞానం, హిందీ, ఆంగ్లం, ఉర్దూ, తెలుగు భాషలపై ఆయనకున్న పట్టు అసాధారణం. దేశమంతా అబ్బురపడేలా తెలంగాణలో పాలన అందిస్తున్న కేసీఆర్.. జాతీయ రాజకీయాల్లోకి వస్తే తమ జీవితాలు కూడా బాగుపడతాయని దేశ ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. కేసీఆర్ తన వ్యూహరచనతో దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లగల సామర్థ్యమున్న వ్యక్తి. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అమలు కావాలంటే కేసీఆర్ జాతీయస్థాయి రాజకీయాల్లోకి రావడం అత్యంత ఆవశ్యకం. అణగారిన వర్గాల అభ్యున్నతి ఒక కేసీఆర్తోనే సాధ్యం. దళితబంధు లాంటి పథకం దేశమంతా విస్తరించాలని దేశంలోని దళిత మేధావులంతా విజ్ఞప్తి చేస్తున్నారు. వ్యవసాయంలో దేశానికే ఆదర్శంగా నిలిచి తెలంగాణ రాష్ట్రం రైస్బౌల్ ఆఫ్ ఇండియాగా ఎదిగింది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, ఆరోగ్యలక్ష్మి, ఆసరా పిం ఛన్లు, డబుల్బెడ్రూం ఇండ్లు, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలతో తెలంగాణ ప్రజల కళ్లల్లో కాంతులు నింపుతున్నారు. అలాంటి పథకాలన్నీ దేశ ప్రజలందరికీ చేరువ కావాలని వేచి చూస్తున్నారు. ప్రజల ఆశీస్సులు, వరంగల్ భద్రకాళి అమ్మవారి దీవెనలు మెండుగా ఉన్న కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ నూతన శకానికి నాంది పలకనున్నారు.
– పరిటాల సుబ్బారావు, రిటైర్డ్ డీఐజీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ, వరంగల్ ఉమ్మడి జిల్లా ఉద్యోగ జేఏసీ మాజీ చైర్మన్
తరతరాలుగా దోపిడీకి గురవుతున్న తెలంగాణను ప్రత్యేక రాష్ట్రం చేయాలని 13 ఏండ్ల పాటు అవిశ్రాంతంగా పోరాడిన యోధుడు సీఎం కేసీఆర్. రాష్ట్రాన్ని సాధించి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపిన అపర చాణక్యుడు. తెలంగాణ దరిద్రం పోగొట్టి అభివృద్ధి ఫలాలు అందరికీ దక్కేలా చేసి, యావత్ దేశంలోని రాష్ర్టాలన్నీ తెలంగాణ వైపు చూసేలా చేసిన రాజనీతిజ్ఞుడు. కేంద్రంలోని మోదీ పాలనలో పంటలకు మద్దతు ధరలేక, కేంద్రం నుంచి సహకారం అందక రైతులు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. స్వరాష్ట్రంలో రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్తు వంటి అనేక పథకాలను సీఎం కేసీఆర్ తీసుకురావడంతో వ్యవసాయం పండుగలా మారింది. విద్య, వైద్య రంగాల్లో గణనీయ మార్పులు తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిదేండ్ల కేసీఆర్ మార్కు పాలన నిదర్శనంగా నిలుస్తున్నది. బీజేపీ పాలనలో వ్యవసాయ రంగంతోపాటు అనేక రం గాలు క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్లాయి. వ్యవసాయ, ఉపాధి రంగాలకు ప్రోత్సాహం లేదు. ఈ నేప థ్యంలో కేసీఅర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే దేశ పురోభివృద్ధి సాధ్యమవుతుంది. విజన్ ఉ న్న నాయకుడని ఇప్పటికే అన్ని వర్గాల ప్రజ లు కేసీఆర్ను కొనియాడుతున్నారు. భారతదేశానికి కేసీఆర్ లాంటి నాయకుడు కావాలి. అప్పుడే తెలంగాణలోని సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలయ్యే వీలుంటుంది.
-పాదూరి ఇంద్రసేనారెడ్డి, టైర్డ్ వార్డెన్, నల్లగొండ