లక్ష్మీదేవిపల్లి, నవంబర్ 20 : సీఎం కేసీఆర్ పాదాలను ఒక్కసారి కాదు.. వం ద సార్లయినా మొక్కుతానని, కేసీఆర్ తనకు పితృ సమానులని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఇటీవల ప్రగతిభవన్లో 8 జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రారంభ కార్యక్రమంలో హెల్త్ డైరెక్టర్.. సీఎం కేసీఆర్కు పాదాభివందనం చేశారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లిలో జరిగిన మున్నూరుకాపు వన సమారాధనలో పాల్గొన్న సందర్భంగా ఇలా వివరించారు.