KCR | కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు జాతీయ వార్తా సంస్థ ఏఎన్ఐ మంగళవారం మాట్లాడారు. బస్యాత్రలో యాత్రలో భాగంగా కొత్తగూడెంకు బయలుదేరిన సమయంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఇంత వరకు అమలు చేయలేదన్నారు. రైతుబంధుపై కాంగ్రెస్ సర్కారు మాట తప్పిందని విమర్శించారు. ఇంత వరకు రైతుబంధు ఇవ్వలేదని.. కాంగ్రెస్ సర్కారుపై అన్నదాతలు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు.
బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలపై తమ పోరాటం కొనసాగుతుందన్నారు. దేశంలో రైతులు కష్టాల్లో ఉన్నారన్నారు. కాంగ్రెస్ అవినీతి గురించి దేశం మొత్తం తెలుసని.. కాంగ్రెస్ కాదు.. స్కాంగ్రెస్ పార్టీ అంటూ విమర్శించారు. దేశంలో పాంతీయ పార్టీల బలం పెరుగుతుందన్నారు. కేంద్ర సర్కారు ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలదే ముఖ్యపాత్ర అని స్పష్టం చేశారు. ఇండియా కూటమి ఎక్కడుందని ప్రశ్నించారు. ఎన్డీయేకు 200కి మించి సీట్లు రావని.. కేంద్ర విచారణ సంస్థలు బీజేపీ జేబు సంస్థలుగా మారిపోయాయని విమర్శించారు. మోదీ హయంలో సంపద విదేశాలకు తరలిపోతుందని చెప్పారు.
రాజకీయ లాభం కోసమే లిక్కర్ స్కాం పేరుతో పార్టీలను వేధిస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మోదీ కల్పితమని.. దేశంలోని న్యాయవ్యవస్థపై మాకు నమ్మకం ఉందని తెలిపారు. రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాదదని.. రాజ్యాంగాన్ని మార్చడంలో తప్పులేదని బీజేపీ నేతలు చెబుతున్నారన్నారు. కాంగ్రెస్ తప్పుడు హామీలతో ప్రజలు మోసపోయారని.. 12 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల టీమ్ అన్నారు.
#WATCH | Khammam: BRS President and Former Telangana CM K. Chandrashekar Rao says, "They (BJP) have troubled every CM in the country…But they were unable to catch hold of Arvind Kejriwal and K. Chandrashekar Rao…So they framed a conspiracy for political benefit through the LG… pic.twitter.com/gamkKnv7wW
— ANI (@ANI) April 30, 2024