హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కవిత సీబీఐ కస్టడీ ఆదివారంతో ముగియనున్నది. ఆమెను సోమవా రం ఉదయం రౌస్ ఎవెన్యూలోని సీబీఐ ప్ర త్యేక న్యాయస్థానం ఎదుట హాజరుపర్చనున్నారు. న్యాయస్థానం శుక్రవారం కవితను సీబీఐ కస్టడీకి ఇచ్చింది. కవితను అదుపులో కి తీసుకున్న సీబీఐ అధికారులు సీబీఐ కేం ద్ర కార్యాలయానికి తీసుకెళ్లారు. కాగా సా యంత్రం కవితను ఆమె తరఫు న్యాయవా ది మోహిత్రావు, భర్త అనిల్, పీఏ శరత్ వెళ్లి కలిశారు. న్యాయపరమైన అంశాలపై చర్చించినట్టు తెల్సింది. సీబీఐ అధికారులు కవిత కస్టడీని మరికొన్ని రోజులు పొడిగించమని అడిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.