హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): అంబేద్కర్ జయంతిని పురస్క రించుకొని తెలంగాణ సాహిత్య అకాడమీ, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా కవి సమ్మేళనాలు నిర్వహించారు. అన్ని జిల్లా కేంద్ర గ్రంథాలయాల్లో నిర్వహించిన కవి సమ్మేళనాలకు కవులు, రచయితలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. అశోక్నగర్లోని సిటీ సెంట్రల్ లైబ్రరీలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కవి సమ్మేళనంలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ.. అంబేదర్ భారీ విగ్రహం ఏర్పాటు, సచివాలయానికి అంబేదర్ పేరు పెట్టిన సీఎం కేసీఆర్కు సాహిత్య సాంస్కృతిక రంగం, గ్రంథాలయ వ్యవస్థల నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ కవి సమ్మేళనాలు ఏర్పాటుచేసినట్టు చెప్పారు. నేటి యువతరం అంబేదర్ వారసులని, ఆయన భావజాలాన్ని అర్థం చేసుకుని ముందడుగు వేయాలని కోరారు.
రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ అయాచితం శ్రీధర్ మాట్లాడుతూ.. కొత్త సచివాలయ భవనానికి అంబేదర్ పేరు పెట్టడం, 125 అడుగుల అంబేదర్ విగ్రహాన్ని ఏర్పాటుచేయడం ద్వారా సీఎం కేసీఆర్ బాబాసాహెబ్ తాత్వికత పట్ల తన నిబద్ధతను చాటి చెప్పారని అన్నారు. బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ.. అంబేదర్ కేవలం ఏదో ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదని, ఆయ న్ను అందరివాడిగా చూడాలని కోరారు. తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ బాలాచారి, హైదరాబాద్ గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పద్మజ, తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎన్ రఘు, అరసం కార్యదర్శి రాపోలు సుదర్శన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ యాకూబ్, తెలంగాన్ సాహితీ అధ్యక్షులు ఆనందాచారి, లెక్చరర్స్ ఫోరం సహాధ్యక్షుడు అబ్దుల్ షాహెద్, అనంతోజు మోహన్ కృష్ణ, తంగెళ్లపల్లి కనకాచారి కవితలు వినిపించారు. ఇందు లో పాల్గొన్న పలువురు కవులు, రచయితలను జ్ఞాపికలతో సత్కరించారు.