హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): వెయిటింగ్లో ఉన్న ఐదుగురు ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం పోస్టింగ్లు ఇచ్చింది. మరో అధికారిని బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మైన్స్ అండ్ జియాలజీ విభా గం డైరెక్టర్గా ఉన్న కాత్యాయనిదేవిని టీఎస్ ఇన్స్టిట్యూ ట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ (ఐఆర్డీ) సీఈవోగా బదిలీ చేసింది. వెయిటింగ్లో ఉన్న ఐఏఎస్ అధికారుల్లో ఎన్ శ్రీధర్కు ఎస్సీ అభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శిగా, అమయ్కుమార్కు పశుసంవర్ధకశాఖ సంయుక్త కార్యదర్శిగా, వినయ్ కృష్ణారెడ్డికి వైద్యారోగ్య కుటుంబ సంక్షేమశాఖ సంయుక్త కార్యదర్శిగా, ఎస్ హరీశ్కు రోడ్లు, భవనాలశా ఖ సంయుక్త కార్యదర్శిగా, సుశీల్కుమార్కు మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్గా ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది.