హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తేతెలంగాణ): ఏపీ కొత్త డీజీపీగా కసిరెడ్డి వెంకటరాజేంద్రనాథ్రెడ్డి నియమితులయ్యారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన రాజేంద్రనాథ్రెడ్డి ప్ర స్తుతం ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నారు. ప్రస్తుత డీజీపీ గౌతం సవాంగ్ను బదిలీచేస్తూ జీఏడీకి రిపోర్ట్చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
సవాంగ్ను ఎందుకు మార్చారు?
సవాంగ్ను ఆకస్మికంగా బాధ్యతల నుంచి ఎందుకు తప్పించారో ప్రజలకు చెప్పాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో విజయవాడలో పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగులు చేపట్టిన ర్యాలీ విజయవంతం అయినందుకే సవాంగ్పై బదిలీవేటు వేశారని భావించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.