బెంగళూరు: బీజేపీ నేతల దగ్గర అక్రమ నగదు కనిపించినా వారిపై కేసులు నమోదు చేసేందుకు ఈడీకి, ఐటీకి భయం పట్టుకుందని కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తంచేసింది. తెలంగాణలో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బీజేపీ డబ్బు ఎరవేసి ప్రలోభపెట్టిన ఘటనపై కే కాంగ్రెస్ స్పందించింది. తెలంగాణలో బీజేపీ చేపట్టిన ఆపరేషన్ లోటస్ సందర్భంగా పోలీసులకు రూ.15 కోట్ల నగదు లభించిందని ఆరోపించింది.
బీజేపీ ఒక్కో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు రూ.100 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలిసిందని, అంటే ఇది వందల కోట్ల వ్యవహారమని, అయినా ఈడీ, ఐటీ అధికారులు ఈ ఘటనపై ఎందుకు ఇప్పటివరకు కేసులు నమోదు చేయలేదని కే కాంగ్రెస్ ప్రశ్నించింది. బీజేపీ నేతల ఇళ్లలో సోదాలు చేయాలంటే ఈడీ, ఐటీ అధికారులకు భయమా? అని కేటీపీసీసీ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించింది.