హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): కంచి కామకోటిపీఠంలో జరుగుతున్న శ్రీవిద్యాయాగానికి హాజరుకావాలని పీఠం (ధర్మాధికారి) శ్రీకార్యం బ్రహ్మ శ్రీ చల్లా విశ్వనాథశాస్త్రి, పీఠం ఆస్థాన పండితుడు బ్రహ్మశ్రీ చింతపల్లి సుబ్రమణ్యశాస్త్రి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావును ఆహ్వానించారు. మంగళవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను కలిసి.. కంచి పీఠం ఆధ్వర్యంలో జరుగుతున్న సంప్రదాయ పాఠశాల ఇతర కార్యకలాపాల కోసం హైదరాబాద్లో స్థలం ఇవ్వాలని వినతిచేశారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి వారికి అనువైన చోట పీఠానికి స్థలం ఇస్తామని హామీఇచ్చారు.