Kilimanjaro Mountain | టాంజానియాలోని కిలిమంజారో పర్వత శిఖరాన్ని తెలంగాణకు చెందిన గిరిజన విద్యార్థి బానోతు వెన్నెల అధిరోహించింది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమవరంపేట గ్రామానికి చెందిన వెన్నెల.. 5,895 మీటర్ల ఎత్తులో ఉన్న పర్వతాన్ని అధిరోహించిన తన కలను సాకారం చేసుకుంది. 2023, జనవరి 26న కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన అనంతరం.. అక్కడ సీఎం కేసీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ ఫోటోలతో కూడిన బ్యానర్ను వెన్నెల ప్రదర్శించారు. అయితే తన కలను సాకారం చేసుకునేందుకు రూ. 3 లక్షల ఆర్థిక సహాయం అందించిన ఎంపీ సంతోష్ కుమార్కు వెన్నెల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
ప్రపంచంలోనే అతి పెద్దదైన మౌంట్ ఎవరెస్ట్ (8840 మీటర్లు) పర్వతాన్ని కూడా అధిరోహిస్తానని బానోతు వెన్నెల చెబుతోంది.
కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన వెన్నెలను ఎంపీ సంతోష్ కుమార్ అభినందించారు. అంతేకాదు వెన్నెల తనకు.. తన కుటుంబానికి మాత్రమే కాదని.. మొత్తం తెలంగాణ రాష్ట్రానికి కూడా కీర్తిని తెచ్చిపెట్టిందని పేర్కొన్నారు.
More power to girl child. Feeling proud that a girl, #BanothVennela from Telangana conquered Mount Kilimanjaro in Tanzania. We, the team #GreenIndiaChallenge thank her for taking our initiative there with her. All the very best Angel.
Everest calling. 😊💪 pic.twitter.com/4q3Gn53mFR— Santosh Kumar J (@MPsantoshtrs) January 28, 2023